Fri Dec 05 2025 13:16:32 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
తిరుమల ఎక్స్ప్రెస్ ను నేటి నుంచి రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు.

తిరుమల ఎక్స్ప్రెస్ ను నేటి నుంచి రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు. ఈరోజు నుంచి పదకొండో తేదీ వరకూ తిరుమల ఎక్స్ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వారం రోజుల పాటు...
వారం రోజుల పాటు ఈ రైలు రద్దయినట్లు తెలిపారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు కూడా దీనిన దృష్టిలో పెట్టుకుని తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులు అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.
Next Story

