Sat Dec 06 2025 12:34:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోకి రాహుల్ జోడోయాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఏపీలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఏపీలో రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ఏపీలోని 119 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు ఉదయం ఆలూరు నియోజకవర్గంలోని చిత్రగుడి హనుమాన్ టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. పాదయాత్రకు పీీసీసీ చీఫ్ శైలజానాధ్, తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
అమరావతి, పోలవరం బాధితులు...
అనంతరం ఆలూరు సిటీ మీదుగా రాత్రి ఏడు గంటలకు మనికుర్తి విలేజ్ ప్రైమరీ స్కూలుకు చేరుకుంటుంది. రాత్రికి చాగి గ్రామంలో రాహుల్ భారత్ జోడో యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. ఈరోజు రాహుల్ ను అమరావతి రైతులు కలిసి తమ సమస్యలను విన్నవిస్తారు. అలాగే పోలవరం నిర్వాసితులు కూడా రాహుల్ గాంధీని కలసి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు. వారితో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మాట్లాడతారు.
Next Story

