Sat Dec 06 2025 14:48:13 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రాలయానికి రాహుల్
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. రాహుల్ యాత్రకు ఏపీలోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. రాహుల్ యాత్రకు ఏపీలోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మూడో రోజు ఎమ్మిగనూరు మండలం బనవాసి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ముగతి గ్రామం వరకూ సాగనుంది. అక్కడ రాహుల్ విశ్రాంతి తీసుకుంటారు.
మంచి రెస్పాన్స్....
సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హాలహర్షి మీదుగా కల్లు దేవకుంట గ్రామంలో రాహుల్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రికి మంత్రాలయం మండలం చెట్నిహళ్లిలో రాహుల్ బస చేయనున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనాన్ని రాహుల్ చేసుకోనున్నారు.
Next Story

