Wed May 15 2024 00:40:59 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ప్రధాని మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న భారీ వర్షాలు, నదులు పొంగుతుండటంతో వస్తున్న వరదలపై మోదీ జగన్ ను అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన సహాయ చర్యల గురించి కూడా మోదీ ఆరా తీశారు. వరద పరిస్థితుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.
పూర్తి సహకారం...
కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మోదీ ఈ సందర్భంగా జగన్ కు హామీ ఇచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా చూడాలని కోరారు.
Next Story