Thu Dec 18 2025 22:56:06 GMT+0000 (Coordinated Universal Time)
26న శ్రీశైలం రానున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెలలో శ్రీశైలంలో పర్యటంచనున్నారు. ఈ నెల 26వ తేదీన ఆమె శ్రీశైలం పర్యటన ఖరారయింది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెలలో శ్రీశైలంలో పర్యటంచనున్నారు. ఈ నెల 26వ తేదీన ఆమె శ్రీశైలం పర్యటన ఖరారయింది. మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీశైలం చేరుకోనున్న రాష్ట్రపతి భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకోనున్నారు.
కేంద్ర పర్యటాక సంస్థ...
అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర పర్యాటక శాఖ చేపట్టిన ప్రసాదం స్కీమ్ పనులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు భక్తులను, పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా సౌకర్యలను కల్పించనున్నారు.
Next Story

