Thu Jan 29 2026 00:14:15 GMT+0000 (Coordinated Universal Time)
వంశీపై రెడీ గా మరో రెండు కేసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు పోలీసులు సిద్ధం చేశారు

గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు పోలీసులు సిద్ధం చేశారు. 2019 ఎన్నికలు సందర్భంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అప్పట్లో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు తేల్చారు. దీనిపై గతంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ కేసు రీఓపెన్ చేయమని పిటిషన్ వేయడంతో కేసులపై పునర్విచారణ చేపట్టారు.
మట్టి తవ్వకాలపై...
వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిసింది. 210 కోట్ల రూపాయల వరకు మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక పేర్కొంది. రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా తవ్వకాలు జరిపినట్లు విజిలెన్స్ నివేదికలో తెలిపారు. మట్టి తవ్వకాలు, జరిమానాల మొత్తం రూ.210 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు.
Next Story

