Mon May 20 2024 22:09:06 GMT+0000 (Coordinated Universal Time)
అనంత ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియో
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ప్రమాదం పట్ల మోదీ దిగ్భ్రాాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రధాని సహాయ నిధికింద ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
తొమ్మిది మంది...
నిన్న అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి బృందంతో వెళుతున్న కారును గూడ్స్ లారీ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు.
- Tags
- modi
- anantapuram
Next Story