Sat Dec 13 2025 19:29:57 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఉడుములకు పవన్ అభినందన.. ఎర్ర చందనం స్మగ్గింగ్ ఇన్విస్టిగేషన్ పై ప్రశంస
ఎర్రచందనం మాఫియా దర్యాప్తుపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ఉడుముల సుధాకర్ రెడ్డికి ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రశంసించారు.

ఎర్రచందనం మాఫియా దర్యాప్తుపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ఉడుముల సుధాకర్ రెడ్డికి ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రశంసించారు. ఎర్రచందనం అక్రమ వ్యాపారంపై జరిగిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో, లోతైన సమాచారంతో సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్రెడ్డి ఉడుముల చేసిన కృషిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందించారు. ఆయన రచించిన పుస్తకం బ్లడ్ సాండర్స్ - ది గ్రేట్ ఫారెస్ట్ హైస్ట్ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ప్లానెట్ కిల్లర్స్ ప్రజలకు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పవన్ అభినందన...
“ప్రమాదకర పరిస్థితుల్లో చేసిన శ్రమ” అని పవన్కల్యాణ్ ఉడుముల సుధాకర్ రెడ్డిని అభినందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్లో ఇలా పోస్టు చేశారు.“మీరు ఎదుర్కొన్న ప్రమాదాలప్పటికీ ఎంతో శ్రద్ధగా చేసిన ఈ పనికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రజలు ఇవి తెలుసుకోవాలి. ఎర్రచందనం అక్రమ రవాణాపై చర్చించే రౌండ్ టేబుల్కు మిమ్మల్ని త్వరలో ఆహ్వానిస్తాం.” అని పవన్ కల్యాణ్ ఎక్స్ లో పేర్కొన్నారు. డాక్యుమెంటరీలో ఎర్రచందనం చెట్లను నరికి వేయడం, రవాణా, అక్రమ ఎగుమతి పద్ధతులను స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపారని పవన్ కల్యాణ్ చెప్పారు. శేషాచలం అడవిలో జరుగుతున్న విధ్వంసం, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన నెట్వర్క్, అమాయక అటవీ సిబ్బంది ప్రాణనష్టాన్ని ఈ పుస్తకం బయటపెట్టిందని పేర్కొన్నారు.
రాజకీయ క్రిమినల్స్...
రాజకీయ అండ ఉన్న నెట్వర్క్స్పై కూడా ఆయన హెచ్చరించారు. “రాజకీయ వేషధారణలో తిరిగే క్రిమినల్స్ చాలా ప్రమాదకరంగా మారారు. స్మగ్లర్లతో కలిసి నడుచుకుంటూ తమ రాజకీయాలకు ఇంధనంగా ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపయోగించుకున్నారు” అని అన్నారు. పుస్తకం నుంచి డాక్యుమెంటరీ వరకు… దశాబ్దాల దర్యాప్తు ఆధారాలు సేకరించారన్నరు. ప్లానెట్ కిల్లర్స్—సుధాకర్రెడ్డి ఉడుముల దశాబ్దాల రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్, ఫీల్డ్వర్క్పై రూపొందించారన్నారు. ఆయన పుస్తకాన్ని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విడుదల చేశారు. మార్టిన్ బౌడోట్ నిర్మాణం, హ్యూగో వాన్ ఆఫెల్ దిశానిర్దేశంలో ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో దర్యాప్తు మార్గాన్ని అనుసరిస్తుంది.
ప్రమాదకర ప్రయాణం...
శేషాచలం అడవి, తిరుపతి, హైదరాబాద్, గుంటూరు, కడప, చెన్నై, జవాధు కొండలు (తమిళనాడు), ఫ్రాన్స్, లియోన్లోని ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం, సింగపూర్ ఇంటర్పోల్ పర్యావరణ విభాగం, అలాగే దుబాయ్—అక్కడ స్మగ్లర్ సాహుల్ హమీద్ను ట్రేస్ చేశారు.ఉదుముల అందించిన ఆధారాలు, జర్నలిస్టిక్ సమాచారం చిత్రానికి కీలకమైంది. అడవుల్లో ప్రమాదకరంగా ప్రయాణించడంతో పాటు కీలక నిందితులతో ముఖాముఖి మాట్లాడటం, దారితప్పించే మార్గాలు, ప్రమాదకర అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, వడివడిగా పనిచేసే కూలీలు, స్మగ్లర్లు, అటవీ అధికారులు, పోలీసులు ఇలా.. అందరితో జరిగిన ఇంటర్వ్యూలు ఈ దర్యాప్తుకు బలం చేకూర్చాయి. చెన్నైలో కూడా కీలక నిందితుడు గంగిరెడ్డితో మాట్లాడారు. పవన్కల్యాణ్ ప్రశంసలకు స్పందించిన సుధాకర్రెడ్డి ఉడుముల స్పందిస్తూ “ఈ పనిని గుర్తించినందుకు పవన్కల్యాణ్ గారికి ధన్యవాదాలు. రెడ్ సాండర్స్ రక్షణపై సంస్థాగతంగా మరింత చర్యలు తీసుకునే చర్చలు ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాను. అని పేర్కొన్నారు. పవన్కల్యాణ్ ప్రకటనతో ఎర్రచందనం మాఫియా బెడద, అంతర్రాష్ట్ర స్థాయి పర్యావరణ చర్యల అవసరం మరోసారి చర్చగా మారింది.
Next Story

