Pawan Kalayn : తాట తీస్తా.. తోలుతీస్తా.. మళ్లీ శపథాలెందుకు... జోగయ్యను అడుగు జానీ?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ కొంత మౌనంగా, హుందాగా వ్యవహరించిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాను మరిచిపోయి తాట తీస్తా.. తోలు వలుస్తా అంటూ హెచ్చరికలు జారీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నారు. అందుకు తన ప్రభుత్వాన్ని సమర్థించుకుంటే తప్పులేదు కానీ.. మళ్లీ ఇక వైసీపీని రానివ్వబోనని శపథం చేయడం ఎందుకని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తన ఊపిరి ఉండగా జగన్ సీఎం కాలేడంటూ శపథం చేసినప్పటికీ 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుకు తెస్తున్నారు.
కూటమి ప్రభుత్వానికి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. మొత్తం 45 అంశాలతో కూడిన లేఖను చేగొండి హరిరామజోగయ్య రాశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను రెండేళ్లవుతున్నా అమలుచేయడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మేనిఫేస్టోను ఇద్దరు ప్రకటించారని,వారి మాటలను నమ్మి ప్రజలు గెలిపించినా వాటిని అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు.

