Fri Dec 05 2025 13:16:55 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలులో ఒమిక్రాన్ టెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ అలజడి రేగింది. శ్రీకాకుళం జిల్లాలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ అలజడి రేగింది. శ్రీకాకుళం జిల్లాలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం ఇద్దరికి కరోనా పాజిటివ్ సోకింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ఉమ్మిలాడకు చేరుకున్నారు. అతనితో కాంటాక్ట్ అయిన 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
వంద మందికి....?
అయితే సౌతాఫ్రికా నుంచి వచ్చిన రక్తనమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మిలాడలో మొత్తం వంద మందికి పరీక్షలు నిర్వహించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. కరోనా నిబంధనలు పాటించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Next Story

