Fri Dec 05 2025 22:09:24 GMT+0000 (Coordinated Universal Time)
తూర్పుగోదావరిలో ఒమిక్రాన్.. భయపడుతున్న ప్రజలు
తూర్పుగోదావరి జిల్లాను ఒమిక్రాన్ వణికిస్తుంది. జిల్లాలోని రావుల పాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి

తూర్పుగోదావరి జిల్లాను ఒమిక్రాన్ వణికిస్తుంది. జిల్లాలోని రావుల పాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఆంధ్రప్రదేశ్ లో పది ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య పదహారుకు చేరుకుంది.
ఈ ముగ్గురు....
అయితే ఈ ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కావడం, వారికే ఒమిక్రాన్ వేరియంట్ సోకడంతో ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే వారిపై అధికారులు నిఘా పెంచారు. తూర్పు గోదావరి జిల్లాలో కేవలం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రమే కాకుండా ప్రస్తుతం 136 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Next Story

