Sat Apr 20 2024 14:35:17 GMT+0000 (Coordinated Universal Time)
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీరు స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
ఈ నెల 26న...
నిన్న తిరుమల శ్రీవారిని 88,924 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,282 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇక ఈ నెల 26వ తేదీన స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని అధికారులు తెలిపారు.
Next Story