Sat Dec 06 2025 03:20:12 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త జిల్లాల్లో కార్యాలయాల కోసం?
తిరుచానూరులోని పద్మావతి భవనం జిల్లా కార్యాలయానికి అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ఉగాది నుంచి ప్రారంభం కానుంది. అయితే జిల్లా కేంద్రాల్లో కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే జిల్లా కార్యాలయాలకు అనువుగా ఉన్న భవనాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అనేక మంది జిల్లా కలెక్టర్లు కార్యాలయాలను పరిశీలించే పనిలో ఉన్నారు.
పద్మావతి భవనం....
తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాను ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలో పలు భవనాలను కలెక్టర్ పరిశీలించనున్నారు. తిరుచానూరులోని పద్మావతి భవనం జిల్లా కార్యాలయానికి అనువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పద్మావతి భవనాన్ని పరిశీలించనున్నారు.
Next Story

