Fri Jan 30 2026 14:46:32 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలకు వెళితే.. దర్శనానికి...?
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట టీబీసీ వరకూ క్యూ లైన్ లో వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శన సమయం ముప్ఫయి గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,728 మంది భక్తులు శ్రీవారిని దర్శింంచకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీరిలో 38,092 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.15 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story

