Sat Dec 20 2025 00:22:59 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరంతా స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శనం సమయం 10 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ తీసుకున్న వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,౫౩౩ మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

