Fri Jan 30 2026 11:54:38 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కసారిగా పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 24 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లో ప్రవేశించిన వారికి శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని అధికరులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,494 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 24,025 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.91 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story

