Sat Apr 20 2024 12:05:00 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో నేడు రష్?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత మూడు రోజులుగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత మూడు రోజులుగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ బయట టీబీసీ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. నడకదారిన వచ్చిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదుగంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారుతు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 87,007 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 43,022 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.08 కోట్ల రూపాయల వచ్చిందని వెల్లడించారు.
Next Story