Tue Apr 23 2024 18:11:46 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట గోకులం గెస్ట్హౌస్ సర్కిల్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఐదుగంటలకు దర్శనం దొరికే అవకాశముంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,226 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,877 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.74 కోట్ల రూపాయలు వచ్చిిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story