Sat Dec 06 2025 10:23:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శనివారం.. నమో వెంకటేశ నామస్మరణలతో.. క్యూలైన్లన్నీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వసతి గృహాలు కూడా దొరకక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహాల కేటాయింపు కోసం బయట పడిగాపులు కాస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులతో క్యూ లైన్ బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 36,229 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

