Sun Mar 08 2026 00:50:53 GMT+0530 (India Standard Time)
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఈనెల 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 14న స్క్రూటినీ చేస్తారు. 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
క్యాంప్ లకు తరలించే...
దాదాపు 900 మంది ఓటర్లున్న ఈ ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్టీ ఇన్ఛార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖలోనే ఉండి ఓటర్లు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు పార్టీలు క్యాంప్ లు నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి.
Next Story

