Sat Jul 27 2024 01:16:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నన్ను చంపించ బోయారు.. అయినా తెగించి పోరాడుతున్నా
ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
![జగన్ నన్ను చంపించ బోయారు.. అయినా తెగించి పోరాడుతున్నా జగన్ నన్ను చంపించ బోయారు.. అయినా తెగించి పోరాడుతున్నా](https://www.telugupost.com/h-upload/2024/04/02/1605107-raghu.webp)
ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ప్రజల కోసమే సీఎం జగన్ తో తాను వైరాన్ని పెట్టుకున్నానని తెలిపారు. చివరకు తాను ప్రాణాలకు తెగించి పోరాడు తున్నానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. జగన్ పై ఉన్న కేసుల్లో ఏ పురోగతీ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
జగన్ కేసులపై...
రాష్ట్రం నుంచి ఎవరూ స్పందించకపోయినా తాను కోర్టులో పిటిషన్ వేశానని రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు. అందుకే జగన్ తననున చంపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నానన్న రఘురామ కృష్ణరాజు కూటమి ఏర్పాటు కోసం తాను ఎన్నో రోజులు ఢిల్లీలో ఉండి రహస్యంగా కృషి చేశానని తెలిపారు.
Next Story