Sat Dec 06 2025 01:14:32 GMT+0000 (Coordinated Universal Time)
రేపో మాపో జైలుకెళ్లే వారి మాటలను పట్టించుకోను
తనపై సీబీఐ నమోదు చేసిన కేసు విషయంపై నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు స్పందించారు.

తనపై సీబీఐ నమోదు చేసిన కేసు విషయంపై నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు స్పందించారు. బ్యాంకుల రుణాలను ఎగవేత కేసులో రఘురామ కృష్ణరాజుతో పాటు 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇప్పుడే ఈ కేసులో ఛార్జిషీటు నమోదు కావడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంపైనా తాను న్యాయస్థానంలోనే సమాధానమిస్తానని చెప్పారు.
సీబీఐ ఛార్జిషీటు....
రేపో మాపో జైలుకు వెళ్లే వారి మాటలను తాను పట్టించుకోనని రఘురామ కృష్ణరాజు తెలిపారు. తాను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని చెప్పారు. రఘురామ కృష్ణరాజు పై బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు, దివాలా ప్రక్రియను కూడా ప్రారంభించమని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
Next Story

