Sat May 18 2024 05:22:31 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టంబరు 8న స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో యువగళం పాదయాత్రను రాజోలులో లోకేష్ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. మళ్లీ మూడు నెలల తర్వాత యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.
చంద్రబాబు అరెస్ట్ తో...
ఈ ఏడాది జనవరిలో యువగళం పాదయాత్ర కుప్పం నుంచి నియోజకవర్గం నుంచి ప్రారంభమయింది. అయితే ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో యాత్రను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని లోకేష్ నిర్ణయించారు. తొలుత ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర నిర్వహించాలని భావించినా ప్రస్తుతం సమయం లేకపోవడంతో విశాఖ వరకే యువగళం పాదయాత్రను పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story