Wed Jan 21 2026 01:24:02 GMT+0000 (Coordinated Universal Time)
రెండున్నర గంటలుగా విచారణ
నారా లోకేష్ ను రెండున్నర గంటలుగా సీఐడీ అధికారులు విచారిస్తున్నారు

నారా లోకేష్ ను రెండున్నర గంటలుగా సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో సీఐడీ విచారణకు నారా లోకేష్ ఈరోజు ఉదయం హాజరయ్యారు. ఉదయం పది గంటల నుంచి అధికారులు అనేక కోణాల్లో లోకేష్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఈకేసులో ఏ 14 నిందితుడిగా లోకేష్ ను చేర్చి సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
అధికారి మార్పు...
హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ జరిగిందన్న ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు. డీఎస్పీ భాస్కర్ నేతృత్వంలోనే సీఐడీ బృందం లోకేష్ ను విచారిస్తున్నారని తెలిసింది. అంతకు ముందు ఇన్విస్టిగేషన్ అధికారిగా ఉన్న జయరాజు స్థానంలో భాస్కర్ ను నియమించి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్ ను విచారించే అవకాశముంది. మధ్యలో గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.
Next Story

