Sat Mar 07 2026 15:14:04 GMT+0530 (India Standard Time)
Narayana : వరదసాయం పై మంత్రి నారాయణ ఏమన్నారంటే?
వరద బాధితులందరీనీ ప్రభుత్వం ఆదుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు

వరద బాధితులందరీనీ ప్రభుత్వం ఆదుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గతంలో ఎన్నడూ చూడలేని వరద వచ్చిందని అన్నారు. తన జీవితంలో ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదన్నారు. అయినా అందరూ సమర్థవంతంగా పనిచేసి ఎన్నో ప్రాణాలను రక్షించగలమని మంత్రి నారాయణ తెలిపారు.
రాత్రి వరకూ...
రాత్రి వరకూ పది లక్షల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బురదను ఫైర్ శాఖ సాయంతో తొలగిస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం కార్మికులను ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు రప్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని చర్యలను తీసుకున్నందువల్లనే ప్రాణ నష్టం తగ్గించగలిగామని తెలిపారు.
Next Story

