Fri Dec 12 2025 09:28:07 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో చేరికలు
వైఎసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ముదునూరి మురళీ కృష్ణరాజు వైఎస్సార్సీపీలో చేరిారు

వైసీపీలో నేడు చేరికలు జరిగాయి. ఓటమి తర్వాత వైసీపీలో చేరికలు జరుగుతుండటం ఆ పార్టీ అభిమానులకు కొంత ఊరట కల్గించే అంశమే. వైసీపీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత చేరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ముదునూరి మురళీకృష్ణరాజు వైసీపీలో చేరారు.
జగన్ సమక్షంలో...
ఈరోజు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ముదునూరి మురళీ కృష్ణరాజు వైఎస్సార్సీపీలో చేరారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు.
Next Story

