Sun May 19 2024 09:52:13 GMT+0000 (Coordinated Universal Time)
సాయితేజ కుటుంబానికి మంచు అండ
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ కుటుంబానికి మోహన్ బాబు కుటుంబం అండగా నిలిచింది. మంచు విష్ణు తరుపున ఆయన పీఏ సాయితేజ కుటుంబాన్ని పరామర్శించారు. సాయితేజ పిల్లలు ఇద్దరికి ఉచిత విద్యను అందిస్తామని ఈ సందర్భంగా మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు మంచు విష్ణు ముందుకు వచ్చారు.
ఉచిత విద్య....
చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ ఆర్మీలో చేరి లాన్స్ నాయక్ గా ఉన్నారు. ఆయన బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీగా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందడంతో వారిద్దరు పిల్లలను ఆదుకునేందుకు మంచు విష్ణు ముందుకు వచ్చారు. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Next Story