Thu Mar 23 2023 12:03:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో కొత్త ఎమ్మెల్సీల భేటీ
ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు

ఇటీవల జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. స్థానిక సంస్థల కోటా కింది నలుగురు ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీ కోటాలో గెెలిచిన ఇద్దరు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తమకు టిక్కెట్ ఇచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
అభినందించిన సీఎం...
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నర్తు రామారావు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ లు జగన్ వద్దకు వచ్చారు. నూతన ఎమ్మెల్సీలను జగన్ అభినందించారు. తమకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story