Fri Dec 05 2025 23:36:03 GMT+0000 (Coordinated Universal Time)
నామినేషన్ దాఖలు చేసిన రఘురామ
ఎన్డీయే నిర్ణయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ స్థానానికి రఘురామ కృష్ణం రాజు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి బుధవారం నామినేషన్లు దాఖలయ్యాయి. ఉండి ఎమ్మెల్యే కె.రఘురామ కృష్ణం రాజు నామినేషన్ వేశారు. ఎన్డీయే కూటమి తరపున వేసిన నామినేషన్ను కూటమిలోని మూడు పార్టీల నేతలు ఆమోదించారు. ఎన్డీయే కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు మంత్రులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఎన్డీయే నిర్ణయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ స్థానానికి రఘురామ కృష్ణం రాజు పేరు ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లపై తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు సంతకాలు చేశారు. టీడీపీ తరపున మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సంతకం చేశారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున, విష్ణు కుమార్ రాజు బీజేపీ తరపున సంతకం చేశారు. ఇతర నామినేషన్లు ఎవరూ దాఖలు చేయకపోవడంతో రఘురామ కృష్ణం రాజును డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.
నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, కె. అచ్చెన్నాయుడు, ఎన్. మనోహర్, సత్యకుమార్ యాదవ్, టీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Next Story

