Fri Dec 05 2025 17:38:00 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : ప్రజా దర్బార్లో లోకేష్కు వినతుల వెల్లువ
ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 35వ రోజు “ప్రజాదర్బార్” నిర్వహించారు. ప్రజల నుంచి అనేక వినతులను స్వీకరించారు.

ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 35వ రోజు “ప్రజాదర్బార్” నిర్వహించారు. ప్రజల నుంచి అనేక వినతులను స్వీకరించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలను తెలిపారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వివిధ సమస్యలపై...
డయాలసిస్ కోసం ఆర్థికసాయం అందించాలని ఒకరు, దివ్యాంగురాలినైన తనకు పెన్షన్ మంజూరు చేయాలని తాడేపల్లికి చెందిన కె.విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.రెండు కిడ్నీలు పాడైపోయిన తనకు డయాసిస్ కోసం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన సంగ నాగేంద్రబాబు కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
Next Story

