Fri Dec 05 2025 23:16:35 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఉదయాన్నే కేంద్ర కార్యాలయానికి విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నరు. సత్వరమే వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నారు.
ఎక్కువ సంఖ్యలో...
ప్రజా వేదికకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి గొట్టిపాటి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ల తొలగింపుపై మంత్రికి ఫిర్యాదులు అధికసంఖ్యలో అందాయని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీంతో పాటు వైసీపీ నేతల అరాచకాలపైనే అధిక భాగం ఫిర్యాదులు అందాయని తెలిపారు.
Next Story

