Fri Jan 24 2025 17:20:27 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పావలా అని మళ్లీ తేలిందిగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశాడు. పల్లకి మోయడానికి తప్ప పవన్ పావలాకు కూడా పనికి రాడని తేలిపోయింది. అందుకే 24 సీీట్లతో సరిపెట్టుకున్నాడంటూ అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఛీ పవన్ అంటూ అంబటి రాంబాబు అన్నారు. ఇంత తక్కువ సంఖ్యలో సీట్లు తీసుకుని జనసేన నేతలను వంచించారని అంబటి రాంబాబు అన్నారు.
సీట్ల సర్దుబాటులో...
టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లోనూ, మూడు పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. అయితే 99 స్ట్రయిక్ రేటు కోసమే తక్కువ సీట్లు తీసుకుని ఎక్కువ స్థానాలను గెలవాలన్న లక్ష్యంతోనే అంగీకరించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story