Tue May 14 2024 06:45:23 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ఇంట్లో విషాదం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం అలుముకుంది. మంత్రి తల్లి థెరీసమ్మ ఈరోజు ఉదయం మరణించారు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంట్లో విషాదం అలుముకుంది. మంత్రి సురేష్ తల్లి థెరీసమ్మ ఈరోజు ఉదయం మరణించారు. హైదరాబాద్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థెరీసమ్మ ఈరోజు మరణించారని వైద్యులు తెలిపారు.
విద్యావేత్తగా...
ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యారంగానికి థెరీసమ్మ సేవలు అందించారని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా ఆమె తీర్చి దిద్దారు. కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఉన్న ఆదిమూలపు శామ్యూల్ జారజి విద్యాసంస్థలకు ఆమె ఛైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఈరోజు సాయంత్రం మార్కాపురంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story