Fri Dec 05 2025 12:41:51 GMT+0000 (Coordinated Universal Time)
Midhun Reddy : ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డికి ఊరట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిధున్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. తాను అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై సిట్ తరుపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో ఇరువర్గాల వాదన విన్న తర్వాత నేడు ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ నెల 20వ తేదీ నుంచి...
ఐక్యరాజ్యసమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ కు వెళ్లేందుకు అనుమతివ్వాలని వేసిన పిటీషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పంది. మిధున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండటంతో పాటు బెయిల్ పై ఉన్నారు. పాస్ పోర్టును అప్పగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకూ న్యూయార్క్ లో ఆయన పర్యటించనున్నారు.
Next Story

