Fri Dec 05 2025 12:58:36 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : నేడు ఎండల తీవత్ర మామూలుగా ఉండదట.. బయటకు రాకపోవడమే మంచిది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సయమంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. రానున్న రెండు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి వేళ తీవ్రమైన ఎండలు, సాయంత్రం పూట వర్షాలు కురుస్తాయని, అది కూడాకొన్ని చోట్ల మాత్రమే కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. పొలాల్లో ఉండే రైతులు, పశువుల కాపర్లు చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరింది. విదర్భ నుంచి గల్ఫ్ మ
ద్రోణి ప్రభావం కారణంగా...
ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని తెలిపింది. దీంతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో మాత్రం నేడు పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. కొన్ని చోట్ల మాత్రం మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో నేడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాయలసీమలో కూడా బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
భారీగా ఉష్ణోగ్రతలు...
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఎండల తీవ్రత పెరిగిపోతుందని వాతావరణ శాఖ అధికారుల చెప్పారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు పగటి వేళ వీలయినంత వరకూ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేింది. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫా బాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఈ అలెర్ట్ జారీ చేసింది. నలభై డిగ్రీలకు మించి అంటే నలభై నుంచి నలభై మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు.
Next Story

