Fri Dec 05 2025 21:08:11 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు.. అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి రానున్న 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
పిడుగులతో కూడిన వర్షాలు...
ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, , పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

