Fri Dec 05 2025 22:45:04 GMT+0000 (Coordinated Universal Time)
ఒంగోలు ఎంపీ మాగుంట ఇంట విషాదం... పార్వతమ్మ మృతి
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ మృతి చెందారు.

ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాగుంట పార్వతమ్మ కావలి శాసనభ్యురాలిగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా గుర్తింపు పొందారు.
సుబ్బరామిరెడ్డి సతీమణిగా...
దీంతో ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవలే మాగుంట సుబ్బారామిరెడ్డి కుమారుడు మరణించగా, ఇప్పుడు పార్వతమ్మ మరణించడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. మాగుంట పార్వతమ్మ అనారోగ్య కారణంగా ఈ రోజు ఉదయం. 06:15 లకు చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో లో చికిత్స పొందుతూ
మరణించారు.
Next Story

