Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. లక్షలాది మంది రావడంతో?
తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు

తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈరోజు రథసప్తమి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. రెండు లక్షల మందికిపైగానే భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మరోసారి అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
18 గంటల సమయం...
తిరుమలలో నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,784 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,470 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

