Sat Dec 13 2025 19:31:09 GMT+0000 (Coordinated Universal Time)
Kotam redddy : పెంచలయ్య కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం
పెంచలయ్య కుటుంబానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థికసాయం అందించారు

గంజాయి రౌడీల చేతుల్లో మరణించిన పెంచలయ్య కుటుంబానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థికసాయం అందించారు. పెంచలయ్యకుటుంబ పోషణకి సొంతంగా 10 లక్షల రూపాయల డబ్బులు అందిం,ానేజపెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు కోటంరెడ్డి హైందవి, కోటంరెడ్డి వైష్ణవిలు తీసుకున్నారు. పెంచలయ్యసాగించిన గంజాయివ్యతిరేక పోరాటానికి కలిసొచ్చే అన్నిపార్టీలతోకలసి మరింత ఉదృతం చేస్తామన్నారు.
అండగా ఉంటానంటూ...
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్.డి.టి. కాలనీ వాసులు భయపడాల్సిన అవసరం దని, తాను అండాగా మీకు ఉంటానని చెప్పారు. ఆర్.డి.టి. కాలనీ అభివృద్ధికి వారంరోజుల్లో 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భావితరాలకు గుర్తుండే విధంగా పెంచలయ్య విగ్రహాన్ని ఆర్.డి.టి. కాలనీలో ఏర్పాటు చేస్తామని, వారికి ఏ కష్టం వచ్చినా కూడా తాము అండగా ఉంటానని తెలిపినకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Next Story

