Sat Mar 28 2026 07:45:06 GMT+0530 (India Standard Time)
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీనెయ్యి వ్యవహారంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మూడు పార్టీలను సమన్వయపర్చుకోవడం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది టీడీపీ తరపున సమన్వయకర్తగా సత్యనారాయణరాజును నియమించింది. సీఎం చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్న సత్యనారాయణరాజు ను పార్టీ తరుపున నియమించింది. ఇవాళ సభ్యులను జనసేన, బీజేపీ పార్టీలు ప్రకటించనున్నాయి.
త్రిసభ్య కమిటీ...
కల్తీనెయ్యి వ్యవహారంలో ఈరోజు త్రిసభ్య కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా మంత్రులు పయ్యావుల, సత్యకుమార్, దుర్గేష్ కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసెంబ్లీ సమావేశాల కారణంగా పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు చేయనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రభుత్వం తరపున ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు పార్టీ తరుపున త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
Next Story

