Tue May 21 2024 14:20:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై దాడి వెనక బొండా ఉమ : కేశినేని నాని
ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి వెనక బోండా ఉమ హస్తం ఉందని అన్నారు.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి వెనక బోండా ఉమ హస్తం ఉందని అన్నారు. బొండా ఉమ కుమారుడు ప్రమేయం కూడా ఇందులో ఉందని అన్నారు. తన అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బొండా ఉమ స్టేట్మెంట్ ఇచ్చారని కేశినేని నాని అన్నారు.
వాళ్లపై కూడా చర్యలు...
పోలీసులు దాడి చేసిన నిందితులను మాత్రమే కాకుండా అందుకు ప్రేరేపించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. జగన్ కు ఈ దాడిలో తృటిలో ప్రాణాపాయం తప్పిందని, కణితికి తగిలి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేసి దాడిని ప్రేరేపించిన వారిని కూడా అరెస్ట్ చేయాలన్నారు.
Next Story