Fri Dec 05 2025 14:35:41 GMT+0000 (Coordinated Universal Time)
Jogaiah : జోగయ్య మరో లేఖ.. ఈసారి మాత్రం
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం ఖాయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. 121 స్థానాలలో కూటమి గెలుస్తుందని ఆయన జోస్యంచెప్పారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మొదటి స్థానంలోనూ, పవన్ కల్యాణ్ రెండో స్థానంలోనూ ఉంటారని చేగొండి హరిరామ జోగయ్య తాను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
గెలపు కూటమిదేనంటూ...
టీడీపీ వంద స్థానాల్లోనూ, జనసేన పదహారు స్థానాల్లోనూ, బీజేపీ ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని చేగొండి హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. ప్రజలు కూడా కూటమికి అండగా నిలవాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్టం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని అన్నారు. గతంలో చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖల్లో జనసేన పై వత్తిడి కనిపించేది. విమర్శలు ఎక్కువగా ఉండేవి. కానీ ఈ లేఖలో మాత్రం విజయం తప్పదని చెప్పారు.
Next Story

