Fri Dec 05 2025 20:18:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ముద్రగడ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన లేఖలో కోరారు. కాపు, ఒంటరి,తెలగ, బలిజ కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి వాళ్లు ఈ కులాలను ఉపయోగించుకోవాలని చూస్తుందన్నారు.
మీరు అలా చేయకండి...
ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చని ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అన్ని పార్టీల వారూ వీరిని ఉపయోగించుకుని వదిలేశారని, మీరు అలా చేయకండని ముద్రగడ తన లేఖలో కోరారు. కాపుల రిజర్వేషన్లు కల్పిస్తే వారు జీవితాంతం మీకు రుణపడి ఉంటారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
Next Story

