Fri Dec 05 2025 20:46:41 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టుకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిటీషన్ వేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటీషన్లో కోరారు

తెలంగాణ హైకోర్టులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిటీషన్ వేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటీషన్లో కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి పిటీషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ముందస్తు బెయిల్...
వైఎస్ అవినాష్రెడ్డిని గతంలో సీబీఐ అధకారులు నాలుగు సార్లు విచారించారు. సుప్రీంకోర్టు తీర్పుతో విచారణ అధికారి మారనున్నారు. రాంసింగ్ను కొనసాగించినా సత్వరం విచారణ పూర్తి చేయడానికి మరో అధికారిని నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో వైఎస్ అవినాష్రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటీషన్ వేశారు.
Next Story

