Sat Dec 06 2025 00:19:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : టీడీపీ అధినేతతో కడప జిల్లా నేతల భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబును కడప జిల్లా నేతలు కలిశారు. రేపు రెండో జాబితాను ప్రకటిస్తుండంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కడప జిల్లా నేతలు కలిశారు. రేపు రెండో జాబితాను ప్రకటిస్తుండంతో వీరు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కడప జిల్లా నేతలు వచ్చారు. రానున్న ఎన్నికల్లో పోటీపై వీరితో చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. చంద్రబాబును కడప జిల్లా నేతలు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూపేష్ రెడ్డి, రితేశ్ రెడ్డి లు కలిశారు.
ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా...
వీరితో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబును కలవడం విశేషం. ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు స్థానాలపై చంద్రబాబు వీరితో చర్చించినట్లు తెలిసింది. బీజేపీ బద్వేలు, జమ్మలమడుగు స్థానాలను కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును వారు కలిసినట్లు తెలిసింది.
Next Story

