Fri Dec 05 2025 23:24:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ భూషణ్ ఆయన చేత గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
హాజరైన...
గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ గా వచ్చిన జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
Next Story

