Wed May 08 2024 16:38:10 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు అండగా...?
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు పలికింది.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు మద్దతు పలికింది. ఇప్పటివరకూ అమరావతికి మద్దతు తెలిపినా రైతుల పాదయాత్రలో జనసేన పాల్గొనడం లేదు. అయితే ఈరోజు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన నెల్లూరు జిల్లాలో రైతుల మహా పాదయాత్రలో జనసేన నేతలు పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటించింది.
పాదయాత్రలో నాదెండ్ల...
ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 26వ తేదీన రైతులను కలసి సంఘీభావం ప్రకటిస్తారు. పాదయాత్రలోనూ రైతులతో కలసి పాల్గొంటారని జనసేన పార్టీ తెలిపింది.
Next Story