Thu Dec 18 2025 23:04:24 GMT+0000 (Coordinated Universal Time)
డిజిటల్ క్యాంపెయిన్ కు భారీ స్పందన
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత వైసీపీ ఎంపీలదేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత వైసీపీ పార్లమెంటు సభ్యులదేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా ఆపాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్లకార్డులు పట్టుకుని తమ ఆందోళనలను తెలియచేయాలని కోరారు.
వైసీపీ ఎంపీలు....
జనసేన పార్టీ ఇప్పటికే ప్లకార్డులతో పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ పై నినదించాలని వైసీపీ ఎంపీలపై డిజిటల్ పోరుకు దిగిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఆవరణాలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలియజేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. జనసేన ప్రారంభించిన డిజిటల్ క్యాంపెయిన్ కు పెద్దయెత్తున స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు.
Next Story

