Fri Dec 05 2025 22:36:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పల్నాడు జిల్లాలో పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లిలో జరగనున్న రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొననున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లిలో జరగనున్న రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 289 మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మధ్యాహ్నం 12 గంటలకు...
పవన్ కల్యాణ్ రైతు భరోసా కార్యక్రమం 12 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పవన్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

