Thu Apr 25 2024 13:41:14 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలోనే పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కూడా విజయవాడలోనే ఉన్నారు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు కూడా విజయవాడలోనే ఉన్నారు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉన్నారు. గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు. గవర్నర్ ను కలసి తన పర్యటనను విశాఖలో పోలీసులు అడ్డుకున్న తీరును, తమ పార్టీ కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంపై చర్చించే అవకాశముంది. ఉదయం 11 గంటలకు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు.
గవర్నర్ అపాయింట్మెంట్...
అయితే గవర్నర్ అపాయింట్మెంట్ పవన్ కోరారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. ఈరోజు పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశాలున్నాయి. పవన్ కు వివిధ రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. వారితో కూడా సమావేశం అవుతున్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలసి పవన్ తో విశాఖలో జరిగిన సంఘటనలపై చర్చించారు.
Next Story